బాగ్దాద్: ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయంపై మరోసారి రాకెట్ దాడులతో దద్దరిల్లింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని బాగ్దాద్లో పటిష్టమైన భద్రత నడుమ ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దుండగులు రాకెట్లతో దాడి చేశారు. గురువారం ఎంబసీ గ్రౌండ్లో రెండు రాకెట్లు పేళాయి. మరో రాకెట్ రాయబార కార్యాలయం సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో పడింది. దీంతో స్కూల్లో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
అంతర్యుద్ధంతో నిత్యం అల్లకల్లోలంగా ఉండే ఇరాక్లో.. అమెరికా దళాలు, కార్యాలయాలే లక్ష్యంగా దాడులు సర్వసాధారణమయ్యాయి. ఈ మధ్యకాలంలో డజన్ల కొద్ది రాకెట్లు, డ్రోన్ బాంబులు కార్యాలయం ఆరణలో పేళాయి. అయితే తాజా పేలుళ్లకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించుకోలేదని ఇరాక్ సైన్యం ప్రకటించింది.
కాగా, ఈ దాడిని అమెరికన్ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాద సంస్థలు ఇరాక్లో శాంతి భద్రతలను, అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.