ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్: నిరుపేదలకు ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలను ఒకేదగ్గర జరిపించేలా సీఎం కేసీఆర్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేశారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో నిర్మించిన డయాగ్నస్టిక్ సెంటర్ను కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో కలిసి ఆమె ప్రారంభించారు.