నల్లగొండ : నల్లగొండ జిల్లాకు చెందిన మండలి శేఖర్(25) అనే యువకుడు అమెరికాలో మృతి చెందాడు. గుర్రంపోడు మండలం తీర్థపల్లి గ్రామానికి చెందిన శేఖర్.. రెండేండ్ల క్రితం ఉపాధి కోసం అమెరికాకు వెళ్లాడు.
అయితే నవంబర్ 19న ఇల్లికాట్ పట్టణంలో రోడ్డుప్రమాదానికి గురై మృతి చెందాడు. శేఖర్ మృతి వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు బోరున విలపించారు. తీర్థపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.