కరీంనగర్ : మద్యానికి బానిస అయిన ఓ యువకుడు శానిటైజర్ తాగి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకానివనిపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన షేక్ సైదా అనే యువకుడు బతుకుదెరువు కోసం చాకానివనిపల్లికి వచ్చాడు.
భవన నిర్మాణ రంగంలో కూలీగా పని చేస్తున్న సైదా మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని గమనించిన సైదా మేస్త్రీ కస్తూరి వెంకటేశం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సైదా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.