హైదరాబాద్: ఉమ్మడి పౌరస్మృతిని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. హిందూ వివాహ చట్టాన్ని పూర్తిగా మార్చలేని వారు, ఎలా యూసీసీని అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీని ఓడించాలనుకుంటున్న విపక్ష పార్టీలు.. భిన్నమైన ఎజెండాతో ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. విపక్ష పార్టీల కూటమి చౌదరీల క్లబ్లా తయారైందన్నారు. విపక్ష పార్టీల భేటీకి తెలంగాణ సీఎంను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు అని, దేశ రాజకీయాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఓవైసీ తెలిపారు.
#WATCH | Our party will oppose UCC…If you (opposition parties) want to defeat BJP then you have to show the difference that you will not follow the agenda set by BJP. They (opposition parties) are a club of big 'Chaudharis'. You have not invited our Telangana CM to the meeting.… pic.twitter.com/ABGOvfPbVV
— ANI (@ANI) July 15, 2023