హైదరాబాద్ : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. జలవిహార్లో జులై 2న నిర్వహించే యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పరిశీలించారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా పర్యటన షెడ్యూల్ను ఎంపీ రంజిత్ రెడ్డి ప్రకటించారు.
యశ్వంత్ సిన్హా జులై 2న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. బేగంపేటలో సిన్హాకు సీఎం కేసీఆర్, మంత్రులు, పలువురు నాయకులు ఘనంగా స్వాగతం పలుకుతారు. అక్కడ్నుంచి 5 నుంచి 6 వేల బైక్లతో ర్యాలీ కొనసాగి జలవిహార్కు చేరుకుంటుంది. జలవిహార్లో సీఎం కేసీఆర్ ప్రసంగం తర్వాత.. యశ్వంత్ సిన్హా మాట్లాడుతారు. జలవిహార్లో సభ ముగిసిన తర్వాత యశ్వంత్ సిన్హా కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకు బయల్దేరుతారు.
Reviewed the arrangements being made to welcome opposition presidential candidate Shri @YashwantSinha who will visit Hyderabad on 2nd July, along with Ministers @YadavTalasani garu, @mahmoodalitrs garu, MLC @PRRTRS garu and Mayor @GadwalvijayaTRS garu.@trspartyonline @KTRTRS pic.twitter.com/pjhVr8GpTN
— Dr Ranjith Reddy – TRS (@DrRanjithReddy) June 30, 2022