హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావేత్త, దేశంలోని నాలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్గా పనిచేసిన ప్రొఫెసర్ వైసీ సింహాద్రి (80) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడ్డ ఆయన ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందారు. 1991లో ఆంధ్రా యూనివర్సిటీ, 1994లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, 1997లో బనారస్ హిందూ, 2006 -08, 2014-17 వరకు పాట్నా విశ్వవిద్యాలయాలకు ఆయన వైస్చాన్స్లర్గా పనిచేశారు. దేశంలోని నాలుగు విశ్వవిద్యాలయాలకు వీసీగా పనిచేసిన మొదటి తెలుగు వ్యక్తి సింహాద్రి కావడం గమనార్హం. జపాన్కు చెందిన నౌకోను వివాహమాడిన ఆయన.. పేద బస్తీల్లోని పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు స్కూలు ఏర్పాటుచేశారు. ఇందుకుగాను నౌకో ప్రతిష్ఠాత్మక స్ఫూర్తి అవార్డు అందుకున్నారు. సింహాద్రి కొంతకాలం ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. సింహాద్రి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తంచేశారు.