సిద్దిపేట : కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని విడుదల చేసి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగదేవ్పూర్ మండలం తిగుల్ నర్సాపూర్ కొండ పోచమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు.