సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 10 : సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తుండటంతో ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని, ప్రభుత్వం కార్మికులకు వెంటనే పని కల్పించాలని పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిరిసిల్ల బీవైనగర్లో మీడియాతో మాట్లాడారు. బంద్లో భా గంగా సోమవారం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు, పవర్లూం, వార్పిన్, వైపని, ఆసామి, జాఫర్, గుమస్తా, కం డెలు చుట్టే కార్మిక సంఘాల ఆధ్వర్యం లో సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించనున్నట్టు తెలిపా రు. అన్నిరంగాల వారు యజమానులతోసహా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 15 రోజులుగా పరిశ్రమ బంద్ పడ్డా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు, ఆసాములు ఉపాధి కల్పించాలని రోడ్డెక్కి అరుస్తున్నా, కార్మికుల ఆకలి కేక లు ప్రభుత్వానికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.