హైదరాబాద్, అక్టోబర్ 26: వేల రూపాయల కాంట్రాక్టు కోసం ఉపఎన్నిక తెచ్చిన రాజగోపాల్రెడ్డిపై ప్రజల్లో.. ముఖ్యంగా మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. డబ్బులు పంచుతూ, సారా పోయించడంపై మహిళలు మండిపడుతున్నారు. సంసారాలు నాశనం చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. రాజగోపాల్ ఓట్లవేటపై ఓ మహిళ తీవ్రస్థాయిలో అక్షింతలు వేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. పనిలోపనిగా ఆమె మోదీ ధరల బాదుడుపై కూడా కామెంట్ చేశారు. ఇంతకూ ఆ మహిళ ఏమన్నారంటే..
తాగుడు పోసిపోసి ఊరోల్లను కరాబు జేస్తున్నరు. ఈ యేస్టు ముండాకొడుకులు. ఈ ముండకొడుకులు రాజీనామాలు ఎందుకు జేయాల్సి ఒచ్చింది? రాత్రి ఊల్లె గుద్దుకొని సస్తున్నరు. ఈల్లేమో పైసలిస్తున్నరు. మంచిగ ఆల్లేమో తాగితందనాలు ఆడుతున్నరు. ఇంట్లున్న ఆడిమనిషి నిదుర వోకుండ జేస్తుర్రు. ఇల్లు, పిల్లలు కరాబు జేస్తానికే తప్ప ఏం లేదు. ఆడు ఆడ గూసోని గ్యాసు పన్నెండొందలు జేసుకుంట.. మా సంసారాలు గూల్చేతందుకే ఉన్నరు ఈల్లంతా. వాల్లు బాగుపెట్టింది ఏం లేదు.