హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): విమానయాన పరిశోధన కోసం హైదరాబాద్-బిట్స్లో విండ్ టన్నెల్ను నిర్మించనున్నారు. డ్రోన్లను పరీక్షించడానికి సుమారు 220 కిలోమీటర్ల వేగంతో గాలిని సృష్టించేలా ఈ సొరంగాన్ని ఏ ర్పాటు చేయనున్నారు. అంతరిక్ష పరిశోధనల ప్రోత్సాహానికి దేశంలోనే అతి పెద్ద విండ్ టన్నెల్ సదుపాయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని బిట్స్ పిలానీ నిర్ణయించింది. ఏడాదిలోగా పూర్తయ్యే ఈ ప్రాజెక్టులో ఏరోడైనమిక్ టెస్టింగ్, రిసెర్చ్ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. గాలి ద్వారా వస్తువుల కదలికలు అనుకరించడానికి, అధ్యయనం చేయడానికి ఈ విండ్ టన్నెల్ ఉపయోగపడుతుంది. ఒకేసారి గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలి వేగాన్ని సృష్టిస్తారు. డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, ఆటోమొబైళ్లు, పారాచూట్, ఎలక్ట్రిక్ వెహికిల్ బ్యాటరీ మేనేజ్మెంట్తో పాటు అనేక అంశాలను పరీక్షించనున్నారు.