ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య
ముషీరాబాద్, అక్టోబర్ 1: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా నిలువడానికి హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్టు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దళితబంధును అడ్డుకొనే కుట్రలో భాగంగా బీసీ బంధును తెరపైకి తెస్తున్న బండి సంజయ్, రేవంత్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఈటల రాజేందర్ వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో దళితులంతా ఏకమై తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. దళితుల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి బాసటగా నిలువడానికి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ఎమ్మార్పీఎస్ తరఫున ప్రచారం చేయనున్నట్టు చెప్పారు. దళితబంధుతో తాగుబోతులు తయారవుతారని మాట్లాడిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు.