ఓదెల, డిసెంబర్ 30: పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామ పరిధిలో ఎవరు మరణించిన వారి నేత్రా లు, అవయవాలు దానం చేసేలా పంచాయతీ పాలకవర్గం శుక్రవారం తీర్మానం చేసింది. సర్పం చ్ ఆకుల ఉదయాదేవి అధ్యక్షతన జరిగిన పంచాయతీ పాలకవర్గంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇక్కడ సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మేర్గు భీష్మాచారి ఆధ్వర్యంలో 135 నేత్ర దానాలు జరిగినందున, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలో ఇక నుంచి ఎవరు మరణించినా వీలైన మేరకు వారి నేత్రాలు, అవయవాలు దానం చేయాలని నిర్ణయించారు. మరణానంతరం శరీర భాగాలు వృథాగా మట్టిలో కలిసిపోవడం కంటే ఇతరులకు ఉపయోగపడే విధంగా చూడాలని భావించారు. ఓదెల మండలంలో ఇప్పటికే అబ్బిడిపల్లె గ్రామంలో అవయవదానానికి అక్కడి జీపీ తీర్మానం చేయగా, అదే బాటలో ఓదెల గ్రామం కూడా ముందుకు రావడంపై ఫౌండేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. ఈ తీర్మాన పత్రాన్ని ఫౌండేషన్ బాధ్యులకు అందజేశారు.