హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) :ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) క్షయ (టీబీ)స్ట్రాటజిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సభ్యుడిగా హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రొఫెసర్ సారంగ్ దియో నియమితులయ్యారు. అంతర్జాతీయంగా 15 మంది నిపుణులతో ఈ బృందం ఏర్పాటైంది.
ఇందులో మన దేశానికి చెందిన సారంగ్ దియో, యెనెపోయో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ అనురాగ్ భార్గవ సభ్యులుగా ఉన్నారు. క్షయవ్యాధిని అంతం చేయడం, వ్యాధిని నిర్మూలించేందుకు ఈ బృందంలోని సభ్యులు అత్యాధునిక, శాస్త్రీయ, సాంకేతిక పరిష్కారాలను సిఫారసు చేస్తారు.