హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తంచేసినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకాతోపాటు కంపెనీ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సీఎం మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తున్నదని తెలిపారు.
గోయెంకా మాట్లాడుతూ తమ కంపెనీ భవిష్యత్తులో చందన్వెల్లి పారిశ్రామికవాడలో ఐటీరంగంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పారు. టైర్ 2, 3 నగరాల్లో ఐటీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, స్పెషల్ సెక్రటరీ డాక్టర్ విష్ణురెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, వెల్స్పాన్ గ్రూప్ హెడ్(కార్పొరేట్ వ్యవహారాలు) చింతన్థాకర్, శ్రీసభార్గవ మొవ్వ తదితరులు పాల్గొన్నారు.