మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 21 : జీతం ఇవ్వకపోయినా సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసి ప్రాణాలు ఇచ్చేందుకు యువత సిద్ధంగా ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో గాయపడిన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండకు చెందిన తిరుపతయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్యాదవ్ను మంత్రి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ కాల్లోకి బుల్లెట్ దిగినా దేశానికి సేవ చేయాలనే ఆయన సం కల్పం మాత్రం సడలలేదన్నారు. దేశం కోసం ప్రా ణాలు ఇచ్చేందుకు యువత సిద్ధపడితే కేంద్రం మా త్రం వారిపైనే బుల్లెట్లు గురిపెట్టడం అన్యాయమన్నా రు. యువత భవిష్యత్తును అర్థం చేసుకొని కేంద్రం పా త పద్ధతిలోనే సైనిక నియామకాలు చేపట్టాలని సూచించారు. ఫిజికల్ టెస్ట్లో ఉత్తీర్ణులైన ఆర్మీ అభ్యర్థులు రాత పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరా రు. కేంద్రం ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.