నార్కట్పల్లి, సెప్టెంబర్ 20 : బ్రాహణవెల్లెంలలో ప్రాజెక్టు ఉన్నా తమ పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం కొండపాకోనిగూడెంలో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు దిగువన ఉన్న పంటపొలాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వ మాత్రం ప్రచార కార్యక్రమాలతో కాలం వెళ్లదీస్తున్నదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు కొత్తగా రిబ్బన్ కటింగ్ చేసి 18 నెలలు దాటినా ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీళ్లు నింపలేదని విమర్శించారు. వెంటనే ప్రాజెక్టు నుంచి నార్కట్పల్లి, చిట్యాల, కట్టంగూర్ మండలాల్లోని చెరువులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.