హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ప్రాజెక్టుల కింద ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం సోమవారం నుంచి అలాట్మెంట్ లెటర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఫోన్ నంబర్లకు ఎస్సెమ్మెస్, వాట్సాప్తో పాటు టీజీహెచ్బీ వెబ్సైట్ ద్వారా అందజేయనున్నది.
ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని హౌసింగ్ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సోమవారం గృహనిర్మాణ శాఖ మంత్రి శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలో 480 ఫ్లాట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.