ఖైరతాబాద్, జూలై 7 : రాజ్యాధికారమే లక్ష్యంగా విశ్వకర్మలు ముందుకు సాగాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. విశ్వకర్మ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఖ్యాపరంగా విశ్వకర్మలు భారీగానే ఉన్నా ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఉన్నవారే అధికారాన్ని దక్కించుకుంటున్నారని తెలిపారు. విశ్వకర్మల్లో ఐక్యత అవసరమని, అప్పుడే శక్తిగా మారుతామని చెప్పారు.
పాలకులు తమ తప్పులను సరిదిద్దుకోని పక్షంలో పోరాటానికి సన్నద్ధమవ్వాలని, డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. భవిష్యత్తులో విశ్వకర్మల హక్కుల సాధనకు చేసే పోరాటాలకు కలిసి వస్తానని తెలిపారు. సమావేశంలో విశ్వకర్మ వేదిక వ్యవస్థాపకుడు అడ్లూరి రవీంద్రాచారి, రచయితల సంఘం ప్రతినిధి గాజోజు నాగభూషణం, కుందారం గణేశ్చారి, ఉపేంద్రాచారి, కిషన్రావు, ప్రముఖ ఆంకాలజిస్ట్ చింతమడక సాయిరాం, కుమారస్వామి, సదాశ్రీ, సీనియర్ జర్నలిస్టులు రాజమౌళిచారి, దేవరకొండ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు.