హైదరాబాద్, మార్చి28 (నమస్తే తెలంగాణ) : తుంగభద్ర బోర్డు చైర్మన్గా బెంగుళూర్ సీడబ్ల్యూసీ మానిటరింగ్ ఆర్గనైజేషన్ వింగ్లో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న వీరేంద్రశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు తుంగభద్ర బోర్డు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే తుంగభద్ర బోర్డుకు ఇన్చార్జి చైర్మన్గా వ్యవహరించారు.