మంచిర్యాల ఏసీసీ: పై ఫొటోలో కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలోగల శ్రీరామ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి. ఈ వినాయకుడి విగ్రహాన్ని శుక్రవారం రూ. 2,22,222 నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. మంచిర్యాల జేసీ మధుసూదన్నాయక్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు జేసీని ఘనంగా సన్మానించారు.