హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్స్ బీఆర్క్ (పేపర్ -2ఏ) ఫలితాల్లో తెలంగాణకు చెందిన జ్యోసుల వెంకట ఆదిత్య మెరిశాడు. వందకు 100 పర్సంటైల్తో సత్తాచాటాడు. తెలంగాణ టాపర్గా నిలిచాడు. ఓపెన్ క్యాటగిరీలో జాతీయస్థాయి 2వ ర్యాంకు సాధించాడు. ఫిబ్రవరి, సెప్టెంబర్ మొదటివారంలో రెండువిడతల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పేపర్ -2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. జేఈఈ పేపర్ -1లో సత్తాచాటిన విద్యార్థులే పేపర్ -2లోనూ మెరవడం విశేషం. బీఆర్క్ (పేపర్ -2ఏ)లో జాతీయస్థాయిలో ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా.. అందులో ఆదిత్య ఒకరు. పేపర్ -1లోనూ ఆదిత్య 100 పర్సంటైల్ సాధించాడు. నేనావత్ ప్రీతం 99 పర్సంటైల్తో ప్రతిభచాటాడు. పేపర్ -2లోనూ వీరు సత్తాచాటారు.