హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో ఎన్టీఆర్ భోళా మనిషి అని, అందుకే ఆయన వెన్నుపోటుకు గురయ్యారంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ నిశ్శబ్ద విప్లవాన్ని తెచ్చారని, పేదల కోసం అనేక పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు.