హైదరాబాద్: ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా తన కుమారుడు కేసీఆర్ ఆరో జన్మదినాన్ని పురస్కరించుకుని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మొక్కలు నాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో తమ కుమారుడికి ఆయన పేరు పెట్టుకున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు, భావితరాల కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటామని, కార్యక్రమం గొప్పతనాన్ని తన కుమారుడికి తెలియజేశానని చెప్పారు.