హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ)/అంబర్పేట: రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చేందుకు హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా సురభి వాణీదేవిని గెలిపించాలని రాజ్యసభసభ్యుడు డాక్టర్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్ నల్లకుంట డివిజన్లోని మదర్డెయిరీ పార్కులో మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవిరమేశ్ అధ్యక్షతన పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలంటే వాణీదేవిని గెలిపించి శాసనమండలికి పంపించాలని విజ్ఞప్తిచేశారు. మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. బ్యాలెట్ పేపర్లో నాలుగో నంబర్ వద్ద వాణీదేవికి ఎదురుగా ఒకటి నంబర్ వేసి ఓటు వేయాలని బ్యాలెట్ పేపర్ను చూపించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ.. వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి శాసనమండలికి పంపించాలని సూచించారు. అభ్యర్థి వాణీదేవి మాట్లాడుతూ.. నల్లకుంటలోనే తాను చాలా రోజులు ఉన్నానని, చాలామంది మిత్రులు, ఆప్తులు, బంధువులు ఉన్నారని గుర్తుచేసుకున్నారు. అందరూ తన విజయానికి సహకరించాలని కోరారు. సమావేశంలో శంకరన్ గురుస్వామి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిగంటి రమేశ్, భగవాన్, రాజుగౌడ్, కే శ్యామ్, పెద్ద శివ, చంద్రశేఖర్, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభసభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో జీహెచ్ఎంసీ పరిధిలోని మాజీ సైనికోద్యోగుల సంఘాల ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. మాజీ సైనికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని వివరించారు. మాజీ ప్రధాని పీవీ కూతురు, విద్యావేత్త వాణీదేవికి మద్దతు ఇవ్వాలని కోరారు. వివిధ మాజీ సైనికోద్యోగుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వాణీదేవి గెలుపునకు కృషిచేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మనోహర్రెడ్డి, సుందర్రావు, సుధాకర్, శివయ్య, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.