హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగులు, సిబ్బందికి సత్వరమే కొవిడ్ టీకాలు వేయించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సిన్ వేయించాలని, ఇప్పటికే 6 వేల మందికిపైగా ఉద్యోగులు కొవిడ్ బారిన పడ్డారని వివరించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ‘విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బంది కూడా ఫ్రంట్లైన్ వర్కర్లే కదా. వారికి వెంటనే టీకాలు వేయించాలి. సీఎండీతో చర్చించి త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాలి’ అని అక్కడే ఉన్న సీఎస్కుస్పష్టం చేశారు. విద్యుత్తు ఉద్యోగులందరికీ టీకాలు వేయించాలని సీఎం ఆదేశించడంపై తెలంగాణ విద్యుత్ ఇంజినీర్ల సం ఘం (టీఈఈఏ) అధ్యక్షుడు శివాజీ హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్న విద్యుత్ సిబ్బందిలో ఇప్పటికే వందల మంది కొవి డ్బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్నిదృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఉద్యోగులకు వ్యాక్సిన్ వే యించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు, ఉద్యోగుల పరిస్థితిని సీఎంకు వివరించిన విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి, సీఎండీ ప్రభాకర్రావుకు శివాజీ కృతజ్ఞతలు తెలిపారు.