హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిన నాటినుంచి మాస్క్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. సెకండ్వేవ్ నేపథ్యంలో ఇంట్లోనూ వాడాల్సిన దుస్థితి నెలకొన్నది. మాస్క్ పెట్టుకున్నప్పటికీ మహమ్మారి బారినపడుతున్నామని పలువురు ఆందోళన చెందుతున్నారు. మాస్క్ ధరించడంపై సరైన అవగాహన లేకనే పలువురు వైరస్బారిన పడుతున్నారని, ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. వైరస్నుంచి మాస్క్ రక్షిస్తుందా? ఎప్పుడు ఏ మాస్కు ధరించాలి? ఎక్కడికి వెళ్లినప్పుడు ధరించాలి? ఎవరు ఏ మాస్క్ వాడాలి? అనే సందేహాలను నివృత్తి చేసేందుకు డబ్ల్యూహెచ్వో మాస్క్లు ధరించడంపై మార్గదర్శకాల రూపంలో ట్విట్టర్లో ఓ వీడియోను విడుదల చేసింది.
సర్జికల్ మాస్క్లు
హెల్త్వర్కర్లు, కొవిడ్- 19 వైరస్ సోకినవారు, లక్షణాలు ఉన్నవారు, వైరస్ వచ్చిందనే అనుమానం ఉన్నవారు, సోషల్ డిస్టెన్స్ పాటించడం వీలులేని ప్రదేశాలకు వెళ్లేవారు సర్జికల్ (మెడికల్) మాస్క్లు ధరించాలి. 60 ఏండ్లుదాటిన వ్యక్తులు, ఆరోగ్య సమస్యలున్నవారు ఈ మాస్కులను ధరించాలి.
ఫ్యాబ్రిక్ మాస్క్లు
ఫ్యాబ్రిక్ మాస్క్లను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. గుడ్డతోచేసే ఈ మాస్క్లను కొవిడ్ లక్షణాలు లేనివారు, సోషల్ వర్కర్లకు దగ్గరగా ఉండేవారు. బ్యాంకు క్యాషియర్లు, ప్రజారవాణా, కిరాణా దుకాణాలు, హోటళ్లలో పనిచేసేవారు, రోజువారీ పనుల కోసం కార్యాలయాలకు వెళ్లేవారు ధరించవచ్చు.
ఏ మాస్క్ నుంచి ఎంతరక్షణ?
మార్కెట్లోకి అనేక రకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో వైరస్, బ్యాక్టీరియా, దుమ్ము, కాలుష్యం నుంచి ఏ మాస్క్ ఎంతశాతంవరకు అరికడుతుందనే డబ్ల్యూహెచ్వో వివరించింది.
వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ తప్పనిసరి: మంత్రి కేటీఆర్
కరోనా వ్యాక్సిన్ వైరస్బారిన పడ్డ వ్యక్తిని తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతుందని, ప్రాణాపాయం నుంచి రక్షిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ చేసుకున్నాకూడా మాస్క్ ధరించడంతోపాటు, తగిన జాగ్రత్తలు తప్పకతీసుకోవాలని సూచించారు. ‘వ్యాక్సిన్ వేసుకుంటే మహమ్మారిని పూర్తిగా అడ్డుకున్నట్టు కాదు. వ్యాక్సిన్ తక్షణ రక్షణను ఇవ్వదు. వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోదు. స్నేహితులు, కుటుంబసభ్యులు వ్యాక్సిన్ తీసుకుని ఉండకపోవచ్చు. అందుకే వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్లు ధరించడం, సానిటైజర్ వినియోగించడం మానొద్దు’ అంటూ మంత్రి కేటీఆర్ బుధవారం ఫేస్బుక్లో ఓ ప్రకటనను పోస్ట్చేశారు.
వారంలో 4లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వారంరోజుల్లో నాలుగు లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు బుధవారం రెమ్డెసివిర్ తయారుచేస్తున్న పలు సంస్థలతో చర్చించాము.