హైదరాబాద్ : స్టూడెంట్ వీసా కలిగిన విద్యార్థులు వారి తరగతులు ఆగస్టు 1న లేదా ఆ తర్వాత ప్రారంభమయ్యే వారికి మాత్రమే యూఎస్లోకి అనుమతి లభిస్తుందని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ మంగళవారం తెలిపింది. ప్రస్తుత ప్రెసిడెన్షియల్ ప్రకటన ప్రకారం స్టూడెంట్ వీసా హోల్డర్లు వారి తరగతులు 2021 ఆగస్టు 1న లేదా ఆ తరువాత ప్రారంభమయ్యేవారే యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించగలరంది. కాగా దురదృష్టవశాత్తు ఎఫ్ వీసా హోల్డర్లను ఈ తేదీ లోపల అనుమతించలేమంది. ఈ విషయాన్ని హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఒకవేళ ఈ తేదీకి ముందు తరగతులు ప్రారంభమయ్యే విద్యార్థులు సదరు విద్యాసంస్థలను సంప్రదించాల్సిందిగా తెలిపింది. అదేవిధంగా https://rb.gy/q78s8u. లింక్ ద్వారా చెక్ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించింది.