హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్ : నెదర్లాండ్స్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) విద్యార్థిని సంస్కృతంలో ఉత్తమ పరిశోధన పత్రం అవార్డుకు ఎంపికైంది. ఈ ఏడాది నవంబర్ 4 నుంచి 10 వరకు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని విక్రమ్ వర్సిటీ నిర్వహించిన అఖిల భారత కాళిదాస సమారోహంలో ఆమె ప్రదర్శించిన పరిశోధన పత్రానికి అవార్డును ప్రకటించారు. నెదర్లాండ్స్కు చెందిన విద్యార్థిని మరియా ఎలిజబెత్ బక్కర్ ‘కాళిదాసు రఘువంశ కాంటో (కాళిదాసు యోగా తత్వశాస్త్రం నిధి) అనే పేరుతో రూపొందించిన పత్రాన్ని సమర్పించింది. ఆమె తరఫున అవార్డును యూవోహెచ్లో సంస్కృత విభాగం పీజీ విద్యార్థి ఎస్కే అభిరామ్ అందుకున్నట్టు శుక్రవారం విక్రమ్ వర్సిటీ ప్రకటించింది.