Whatsapp | న్యూఢిల్లీ, మే 11:గుర్తుతెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి స్పాం కాల్స్ వస్తున్నాయన్న అంశంపై వాట్సాప్కు నోటీసులు పం పనున్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. డిజిటల్ వేదికలపై వినియోగదారుల భద్రతకు సదరు కంపెనీలే బాధ్యత వహించాలని చెప్పారు. గోప్యతకు భంగం వాటిల్లిన ప్రతి ఉదంతంపైనా కేంద్రం స్పందిస్తుందన్నారు.
యూజర్ల భద్రత, గోప్యతకు భంగం కలగకుండా డిజిటల్ వేదికలే బాధ్యత వహించాలని స్పష్టమైన సందేశాల్ని పంపుతున్నట్టు ఆయన చెప్పారు. వాట్సాప్ డాటాబేస్లో ఏదైనా లోపం ఉం దా? స్పాం కాల్స్ వెళ్లిన వాట్సాప్ నంబర్లపై పరిశీలన జరుపుతున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, కెన్యా, ఇథియోపియా దేశాల నుంచి తమకు వాట్సాప్లో స్పాం కాల్స్ వస్తున్నాయని అనేకమంది గతకొద్ది రోజులుగా ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తున్నారు.