తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ, సాహితీ సాంస్కృతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతి నుంచి గోల్కొండ వరకు మహా కవియాత్ర నిర్వహించారు. యాత్రలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, అమ్మంగి వేణుగోపాల్, నాలేశ్వరం శంకరం, అక్షరయాన్ ఫౌండర్ ఐనంపూడి శ్రీలక్ష్మి, ప్రముఖ కవులు కందుకూరి శ్రీరాములు, విశ్వైకతోపాటు తెలుగు రాష్ర్టాల నుంచి సుమారు 200 మంది కవులు, రచయితలు, కళాకారులు పాల్గొన్నారు. – హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ