ఆత్మకూర్.ఎస్: మండల పరిధి మిడతనపల్లి గ్రామ సర్పంచ్ సామ మంగమ్మ- ఉపేందర్రెడ్డిలకి చెందిన వ్యవసాయ బోరుబావి నుంచి ఎలాంటి విద్యుత్ మోటార్ అవసరం లేకుండానే పాతాళ గంగ ఉబికి వస్తున్నదని ఎంపీపీ మర్ల స్వర్ణల తాచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం వారు బోరు బావిని సందర్శించారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చెక్డ్యాంల ఫలితంగా భారీ స్థాయిలో భూగర్భ జలాలు పెరిగాయని, ఈ కారణంగా గత కొన్ని రోజులుగా ఈ బోరు బావి నుంచి నీళ్లు పైకి వస్తున్నాయన్నారు.
గతంలో 300ల ఫీట్లు బోరుబావులు తవ్వినా చుక్క నీళ్ళు రాక రైతులు అప్పులపాలయ్యే వారని కానీ ఇప్పుడు మంత్రి చొరవతో నిర్మించిన చెక్డ్యాంలతో మండలంలో వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, మంత్రి జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ బద్ద ధనమ్మ , ఉప సర్పంచ్ కలకోట పరశురాములు, ఆత్మకూర్.ఎస్ ఎంపీటీసీ వెంకటరెడ్డి, నాయకులు ముద్దం మధు, దామిడి శ్రీను, పగడాల ఉపేందర్రెడ్డి, మెట్టు రవీందర్రెడ్డి, యలమకొండ గంగారెడ్డి, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు సామ భిక్షంరెడ్డి, సామ లకా్ష్మరెడ్డి, ఉప్పుల సైదులు, పిట్టల సంతోష్, జటంగి గంగయ్య, సామ ఏకస్వామి, పూసపాటి మధు, బైరోజు మహేంద్రచారి, వాసా జ్ఞానసుందర్, పన్నాల అనీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.