హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పనులను కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. రాష్ట్ర ఎన్నికల విభాగంలో కొత్తగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా, ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ను సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. కేంద్ర ఎన్నికల అధికారుల బృందం మూడు రోజులపాటు ఇటీవలే రాష్ట్రంలో పర్యటించింది. సీఎస్, డీజీపీ, ఆదాయ పన్నులశాఖ, ఇతర శాఖలతో వరుస సమీక్షలు నిర్వహించింది. ఎన్నికల ఏర్పాట్లపై తగిన సూచనలు చేసింది. ఇప్పుడు ఎన్నికల సంఘంలోకి మరో ఇద్దరు అధికారులు నియమించింది.