ఖమ్మం : టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్య పట్ల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణయ్య భౌతికకాయానికి తుమ్మల నాగేశ్వర్ రావు, తాత మధుసూదన్ నివాళులర్పించారు. కృష్ణయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. కృష్ణయ్య అనుచరులు ఎవరూ ఎలాంటి చర్యలకు దిగొద్దని కోరారు. ఖమ్మం జిల్లా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. హత్యా రాజకీయాలు జరిగితే జిల్లా వెనుకబడి పోతుందనేది తన భయం అని పేర్కొన్నారు. కృష్ణయ్య హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నానని నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడైన కృష్ణయ్య.. ఆంధ్రా బ్యాంకు కర్షక సేవ సహకార సంఘం డైరెక్టర్గా ఉన్నారు.