హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ సేవలు ఎలా ఉన్నాయి? బస్సులు సమయానికి వస్తున్నాయా? డ్రైవర్, కండక్టర్ల ప్రవర్తన సక్రమంగా ఉంటున్నదా? బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా? కార్గో సేవలు ఎలా ఉన్నాయి..? అంటూ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులను అడిగి తెలుసుకొన్నారు. ‘బస్డే’ సందర్భంగా గురువారం ఉదయం ఎండీ సజ్జనార్ మెహదీపట్నం డిపోకు చెందిన 113 ఐ/ఎం బస్సులో టెలిఫోన్ భవన్ నుంచి బస్భవన్ వరకు ప్రయాణించారు. స్వయంగా టికెట్కొని బస్సులో ప్రయాణించిన ఎండీ ప్రయాణికులతో మాట కలిపారు. బస్సుల సమయపాలన, సిబ్బంది ప్రవర్తన, పనితీరు, బస్సుల్లో శుభ్రత, కార్గో తదితర సేవల గురించి అడిగి తెలుసుకొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సంస్థ అభ్యున్నతికి సహకారం అందించాలని ప్రజలకు, ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.