నాంపల్లి కోర్టులు, మే 15 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో నిందితులు కాంతం మురళీధర్రెడ్డి, ఆకుల మనోజ్కుమార్, ఆది సాయిబాబు, పొన్నం వరుణ్కుమార్, రమావత్ మహేశ్, ముదావత్ శివకుమార్ను 4 రోజులపాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ సోమవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో ఇద్దరు నిందితులు కేతావత్ డాక్యానాయక్, కేతావత్ రాజేశ్వర్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీ కత్తుతో ఇద్దరి జమానత్లను కోర్టుకు సమర్పించాలని, పాస్ పోర్టును అప్పగించడంతోపా టు 3 నెలలపాటు వారానికి 3 రోజులు సిట్ పోలీసుల ఎదు ట హాజరుకావాలని వారికి స్పష్టం చేసింది. ప్రధాన నిందితుడు రాజేశ్వర్రెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న రేణుక రాథోడ్, డాక్యానాయక్, రాజేశ్వర్, పీ గోపాల్నాయక్, శమీమ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగించాలని కోరుతూ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషెన్స్ జడ్జి కోర్టులో వేసిన పిటిషన్పై సోమవారం ఈడీ పీపీ జగన్మోహన్ వాదనలు వినిపించారు. ఈ ఐదుగురుకి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. వారిని ఈడీ కస్టడీలోకి తీసుకుని, విచారణ చేపట్టేందుకు అనుమతించాలని జగ్మోహన్ జిల్లా కోర్టును కోరారు.