టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి
హైదరాబాద్, మార్చి 12 : ఉద్యోగ నియామకాల అంశంలో టీఎస్పీఎస్సీపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి హెచ్చరించారు. ఇలా చేస్తే పరీక్షలు రాయకుండా అభ్యర్థులపై నిషేధం విధిస్తామని చెప్పారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. కమిషన్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అభ్యర్థులెవరూ ఆలోచించకుండా పోస్టులు పెట్టడం, ఎవరో పంపించినవి ఫార్వర్డ్ చేయరాదని సూచించారు.