హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్ష మార్కుల లెక్కింపునకు నార్మలైజేషన్ విధానం అమ లు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇప్పటికే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్బీ), మరికొన్ని నియామక సం స్థలు మార్కుల లెక్కింపునకు నార్మలైజేషన్ విధానా న్ని అమలు చేస్తున్నాయి. కానీ, టీఎస్పీఎస్సీ మా త్రం తొలిసారిగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో మే 8, 9, 21, 22 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. మే 8, 9 తేదీల్లో 360 ఏఈఈ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, అగ్రికల్చర్, మెకానికల్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. మే 21, 22న సివిల్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించారు. 1,180 ఏఈఈ(సివిల్) ఉద్యోగాలకు 44,2 97 దరఖాస్తులు రాగా, 36,849 మంది పరీక్ష రాశారు. సివిల్ ఏఈఈలో నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని కమిషన్ నిర్ణయించింది.
ఒకే సబ్జెక్టుకు సంబంధించి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు ఒక సెషన్లోని ప్రశ్నలకు, మరో సెషన్లోని ప్రశ్నలకు సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకొంటారు. అయితే దీనివల్ల కొందరికి సు లభ ప్రశ్నలు, మరికొందరికి కఠిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ వ్యత్యాసాన్ని బ్యాలెన్స్ చేసేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తారు. ఉదయం 500 మందికి పరీక్ష నిర్వహిస్తే.. అందులో ఎకువ మారులు వచ్చిన అభ్యర్థుల సగటు, స్టాండర్డ్ డీవియేషన్ పద్ధతిలో తీసుకొని మారులను లెకిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 500 మంది హాజరైతే.. అందు లో గరిష్ఠంగా మారులు వచ్చిన అభ్యర్థుల సగటు, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాను తీసుకొని మారు లు లెకిస్తారు. ఒకే సెషన్కు సంబంధించి ప్రశ్నపత్రంలో అభ్యర్థి సాధించిన మార్కులను నార్మలైజేషన్ విధానం అమలు చేశాక వచ్చే మార్కులతో పో ల్చినప్పుడు, తుది మార్కులు పెరగవచ్చు లేదా తగ్గొ చ్చు. నార్మలైజేషన్లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్టు ప్రశ్నపత్రాలకు మార్కులను వేర్వేరుగా లెక్కిస్తారు. ఇలా లెక్కించగా వచ్చిన మార్కులకు నార్మలైజేషన్ మార్కులను కలిపితే అభ్యర్థి మొత్తం మార్కులు వస్తాయి. అయితే.. నార్మలైజేషన్ ఫార్ములా, కంప్యూటర్ అప్లికేషన్ ఆధారంగా అభ్యర్థి మార్కులు నిర్ణయిస్తారు. అంతేతప్ప, నార్మలైజేషన్ విధానంలో మానవుల ప్రమేయం ఏమీ ఉండదు.