TS Weather | రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు మూడు రోజుల పాటు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.