హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజును డిసెంబర్ 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21, రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 3 వరకు చెల్లించే అవకాశం ఉన్నదని వివరించారు. ఈ ఫీజులను విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలని సూచించారు.