TS Polycet | హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన టీఎస్ పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు 259 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు 92,808 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షా కేంద్రంలోకి గంట ముందే అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇక విద్యార్థులు హెచ్బీ బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.