TS PGECET | హైదరాబాద్ : మార్చి 12వ తేదీన టీఎస్ పీజీఈసెట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అరుణ కుమారి వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన పీజీఈసెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంలో జరగనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మే 10. జూన్ 6వ తేదీ నుంచి 9 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది టీఎస్ పీజీఈసెట్ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది.