హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జూన్ 9న గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వంటి రెండు పరీక్షలు ఉండడంతో జూన్ 6 నుంచి 9వరకు జరగాల్సిన టీఎస్ పీజీఈసెట్-2024 పరీక్షను వాయిదా వేస్తూ సెట్ కన్వీనర్ డాక్టర్ ఏ అరుణకుమారి నిర్ణయం తీసుకున్నారు. తిరిగి జూన్ 10 నుంచి 13 వరకు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్టు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.