యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని సోమవారం భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, తెలంగాణ హాకీ సెక్రెటరీ ముఖేశ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు.