హైదరాబాద్ : విద్యార్థులు, యువత జీవితాలను మార్చేందుకు విశేష కృషి చేసిన టీచర్లకు కేంద్రం ప్రతీ ఏటా ఇచ్చే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం 44 మంది ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికవగా వారిలో ఒకరు ఆసిఫాబాద్ జిల్లా సావర్ఖేడ్ ప్రధానోపాధ్యాయుడు రంగయ్య మరొకరు సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రామస్వామి.
ఉపాధ్యాయ వృత్తిని సామాజిక సేవగా భావించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేలా కృషి చేసిన హెచ్ఎంలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు. నిరుపేద విద్యార్థుల పట్ల చూపిన చొరవ సిద్దిపేట ఇందిరా నగర్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు రామస్వామి పనితీరుకు, సంకల్పానికి ఈ అవార్డు నిదర్శనమని మంత్రి కొనియాడారు.