TS Gurukulam | ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2024 విద్యాసంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవనున్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ సెక్రటరీ, వీటీజీ సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2023-24విద్యాసంవత్సరంలో నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. విద్యార్థులు నేటి నుంచి జనవరి 6లోగా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలన్నారు. ఫిబ్రవరి11న రాతపరీక్ష నిర్వహించి, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఇతర వివరాలకు 1800 425 45678 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు.