హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ, ప్రముఖ స్వాతంత్య్ర సమరమోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న ఐలమ్మ జయంతి, 27న లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.