హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఎంసెట్ ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇంజినీరింగ్ పరీక్షపై 1,700, అగ్రికల్చర్ అండ్ మెడికల్పై వచ్చిన 674 అభ్యంతరాలను జేఎన్టీయూ సబ్జెక్టులు పరిశీలిస్తున్నారు. అయితే, 80 శాతం పరిగణనలోకి తీసుకోలేనివని, కేవలం 20శాతం అభ్యంతరాలే సవ్యమైనవని ఎంసెట్ అధికారులు తేల్చారు. మొత్తం 160 ప్రశ్నల్లో కొందరు సరైన ఆధారాల్లేకుండానే అభ్యంతరాలు తెలియజేసినట్టు పేర్కొన్నారు. ఈ పరిశీలన పూర్తైన తర్వాత తుది ‘కీ’ని ఖరారుచేసి, ప్రశ్నపత్రాల నార్మలైజేషన్ను చేపడతారు. ఆ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఏడాది టీఎస్ ఎంసెట్కు 3.01లక్షల అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.