నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. ఇక తొలి రౌండ్లోనూ టీఆర్ఎస్ 1,475 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి.
నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ఏర్పాటు చేశారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా కొవిడ్ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో సహా పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కౌంటింగ్లో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్లో 400 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.