కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి టీఆర్ఎస్ ఎంపీల వినతి
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతగతిన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మం త్రి నితిన్ గడరీకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వద్దిరాజు పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నెకొండ నుంచి నెల్లికుదురు వరకు ఉన్న ఆర్అండ్బీ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కోరారు. భద్రాచలంలో గోదావరిపై నిర్మించే రెండో వంతె న పనులను త్వరగా పూర్తి చేయాలని, భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు నిర్మించిన 106 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారికి సంఖ్య ఖరారు చేయాలని విజ్ఞప్తిచేశారు.